Sunday, May 25, 2008

ఈ మాధుర్యం తెలుగు వారిది(కి) మాత్రమే...

తెలుగుభాషకే ప్రత్యేకత సంతరించి భారతీశిరోభూషణమైన అవధాన పద్ధతికి భక్త్యంజలి....
మొదటి పుష్పం :-
ఏమి సరస్వతీ విభవమెంతన నా అవధానవిద్యలన్
నా మది పొంగిపోవ విననా యిటకమ్మని పద్యపూరణల్
భామ, విరించి రాణి కన ఈ కవితాఝరి తేనెసోనగా
నా మది తాకుచుండె కనగా యిదివొక్క తెలుంగుభాగ్యమే.

రెండవ పుష్పం :-

కన నా అవధానమ్మిదె
విన ఈ కవితావిశారదావిన్నాణం
అన నా అంధ్రుల సొమ్మిం
తన, యెద పొంగె రసతరంగిణిలోనన్.

బుధజన విధేయురాలు

చల్లా మైత్రేయి.